బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నవంబర్ 11న పోలింగ్ జరగనున్న ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. బీఆర్ఎస్, మాగంటి సునీతతో పాటు ప్రత్యామ్నాయంగా విష్ణువర్ధన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసింది.