జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కావడంతో హైదరాబాద్ జిల్లా అంతటా ఎన్నికల నియమావళి (కోడ్) అమలులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఈ విషయాన్ని తెలిపారు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గంలో 4 లక్షల మంది ఓటర్ల కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, కేసుల నమోదు తప్పదని కమిషనర్ హెచ్చరించారు. ఓటు హక్కు లేని వారికి నమోదు చేసుకునేందుకు 10 రోజుల సమయం ఇచ్చారు.