జూబ్లీహిల్స్ శాసనసభ ఉపఎన్నికకు సంబంధించిన కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ఏఐసీసీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఉపఎన్నికలో త్రిముఖ పోరు ఖాయమైంది. బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత ఇప్పటికే బరిలో ఉన్నారు. నవీన్ యాదవ్ ఎంపిక వెనుక ముస్లిం-యాదవ్ (M-Y) ఓటు బ్యాంకును బలపరచాలనే కాంగ్రెస్ వ్యూహం ఉంది. మజ్లిస్ కూడా కాంగ్రెస్కు మద్దతు ఇవ్వనుండటంతో.. ఈ సామాజిక సమీకరణం కాంగ్రెస్ గెలుపు అవకాశాలను పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.