జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ నాయకత్వం తుది కసరత్తు చేస్తోంది. నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, పేర్లతో జాబితాను ఏఐసీసీకి పంపారు. మరోవైపు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీ వెళ్తున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఉన్న కేసు దృష్ట్యా, బలమైన వాదనల కోసం సీనియర్ న్యాయవాదులతో చర్చించేందుకు ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.