తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక హీట్ పెంచేసింది. బైపోల్కు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. పార్టీలు మాత్రం ఇప్పటినుంచే వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ బైపోల్స్లో ఎవరిని బరిలోకి దింపాలి అనేదానిపై లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు.. ఆశావహులు కూడా తమ సత్తా నిరూపించుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థిని బరిలోకి దింపాలని చంద్రబాబు కూడా ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు త్రిముఖ పోటీలో ఉండగా.. టీడీపీ కూడా వస్తుందనే ఊహాగానాలు రావడంతో మరింత ఆసక్తికరంగా మారాయి. అసలు జూబ్లీహిల్స్పై ఎవరి అంచనాలు ఏంటి. ఎవరి లెక్కలు ఏంటి. ఎవరి పాచిక పారనుంది అనేదానిపై ఈ స్టోరీలో చూద్దాం.