జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అందరికంటే ముందు అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానం కాపాడుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉన ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఈ నెల 19న జూబ్లీహిల్స్లో జరిగే రోడ్ షోలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది.