రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. తెలంగాణను ఇన్నోవేషన్ హబ్గా మారుస్తామని తెలిపారు. ఇందులో భాగంగా వరంగల్, నల్గొండ నగరాలలో కూడా టీ-హబ్ తరహా ఇంక్యూబేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దీనికోసం కాకతీయ, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాలతో త్వరలోనే ఎంవోయూలు కుదుర్చుకోనున్నారు. తెలంగాణను గ్లోబల్ ఫార్మా హబ్తో పాటు ‘ఫార్మసీ ఆఫ్ పర్పస్’గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రవాసీ భారతీయ నిపుణులు తమ అనుభవాన్ని ‘నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్’గా రాష్ట్రానికి అందించాలని ఆయన పిలుపు ఇచ్చారు.