ఈమధ్య కాలంలో ప్రయాణికులకు వరుసగా బ్యాడ్న్యూస్లు చెబుతూ వస్తోన్న తెలంగాణ ఆర్టీసీ.. తాజాగా శుభవార్త చెప్పింది. టికెట్ ధరలను పెంచిన ఆర్టీసీ.. ఇప్పుడు మాత్రం హైదరాబాద్-బెంగళూరు మార్గంలో సూపర్ లగ్జరీ బస్సుల్లో టికెట్ ధరలపై 20 శాతం తగ్గింపు ప్రకటించింది. అలాగే, హైదరాబాద్-తిరుపతి లహరి ఏసీ బస్సుల్లో 10 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఈ రెండు ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు. అందుకే ఈ రూట్లో ఆర్టీసీ ఛార్జీలు తగ్గించింది. ఆ వివరాలు..