టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈ జిల్లాల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులు..

5 months ago 16
జనవరి 28 నుండి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈసారి 3,495 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా.. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నారు. అయితే.. ప్రత్యేక బస్సుల నిర్వహణ దృష్ట్యా సాధారణ ఛార్జీపై 50 శాతం అదనపు మొత్తాన్ని వసూలు చేయనున్నారు.
Read Entire Article