తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధ్వర్యంలోని ఆలయంలో అడుగడుగునా నిర్లక్ష్యం బయటపడింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంకటపాలెం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలింది. ఆలయ పరిశుభ్రత, అలంకరణ, క్యూలైన్ల ఏర్పాట్లలో లోపాలున్నాయని చూసి.. సిబ్బందిపై సీరియస్ అయ్యారు. అనంతరం భక్తులకు అసౌకర్యం కలిగించవద్దని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా శ్రీవారి ఆలయాల్లో సేవా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఇలాంటి సందర్శనలు చేస్తామన్నారు.