టీటీడీ ఉద్యోగి ఇంట్లో భారీ చోరీ జరిగింది. దొంగలు ఏకంగా 32 తులాల బంగారాన్ని మాయం చేశారు. దీంతోపాటు రూ.10 లక్షల నగదును కూడా ఎత్తుకెళ్లిపోయారు. అయితే కుమార్తె పెళ్లి కోసం.. ఆ టీటీడీ ఉద్యోగి.. డబ్బు, నగలను ఇంట్లో ఉంచగా.. దుండగులు వచ్చి దోచుకెళ్లిపోయారు. దీంతో ఆ ఉద్యోగి.. పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక దొంగలను కనిపెట్టే పనిలో పోలీసులు పడ్డారు.