టీటీడీ కీలక నిర్ణయం.. ఆ ఆలయానికి మహర్దశ..

1 year ago 28
తిరుపతి గంగమ్మ ఆలయాన్ని టీటీడీ నిధులతో అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు కేటాయించాలని కోరారని.. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే టీటీడీ నిధులతోనే గంగమ్మ ఆలయం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
Read Entire Article