తిరుపతి గంగమ్మ ఆలయాన్ని టీటీడీ నిధులతో అభివృద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. శనివారం తాతయ్యగుంట గంగమ్మ ఆలయాన్ని టీటీడీ ఛైర్మన్ సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే నిధులు కేటాయించాలని కోరారని.. వచ్చే బోర్డు సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే టీటీడీ నిధులతోనే గంగమ్మ ఆలయం అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.