టీటీడీ పరకామణి కేసు.. మాజీ ఏవీఎస్వో సతీష్ హత్య కేసులో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

3 months ago 8
రైల్వే సీఐ, టీటీడీ మాజీ ఏ.వీ.ఎస్‌.వో సతీష్‌కుమార్‌ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఇప్పటికే 10 ప్రత్యేక బృందాల ద్వారా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే, ఈ కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సతీష్‌కుమార్‌ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఏసీ బోగీల్లోని 1140 మంది వివరాలు సేకరించి వారి నుంచి వివరాలు సేకరించనున్నారు. సతీష్‌కుమార్‌ శరీర బరువుతో సమానమైన రెండు బొమ్మలతో.. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఘటన జరిగిన సమయంలో రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన రైలు వేగం తక్కువగా ఉంది. దీంతో కచ్చితమైన ఫలితాల కోసం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్‌కుమార్‌ ఆధ్వర్యంలో మరోసారి సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఈసారి మూడు బొమ్మలను తయారుచేసి గుత్తి స్టేషన్‌లో రైలు ఎక్కి ఘటనా స్థలం వద్దకు రాగానే వాటిని కిందకు తోసేశారు. ఆ సమయంలో రైలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
Read Entire Article