Eluru MP: ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ను బెదిరించి, రూ.10 కోట్లు డిమాండ్ చేసిన కేసులో ఏపీ పోలీసులు.. ముంబైలో ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుడు.. తనను ఆర్టీఐ కార్యకర్తగా చెప్పుకుంటూ, ఎంపీ ఆస్తుల చిట్టా బయటపెడతానని, కేంద్ర దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇస్తానని ఈమెయిల్స్ ద్వారా బెదిరించాడు. నిందుతిడిని కలవడానికి వెళ్లిన ఎంపీ పీఏను కత్తితో బెదిరించి డబ్బు కూడా దోచుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా అతడిని అరెస్ట్ చేశారు.