Investments in Andhra Pradesh: ఏపీలో టీడీపీ కూటమి పాలనకు త్వరలోనే ఏడాది పూర్తి కానుంది. జూన్ 12వ తేదీతో ఏపీలో ఎన్డీఏ కూటమి పాలనకు ఏడాది పూర్తి కావొస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ఏడాది పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల వివరాలను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. ఏడాది కాలంలో ఏపీ రూ.9.4 లక్షల కోట్లు పెట్టుబడులను ఆకర్షించిందని మంత్రి టీజీ భరత్ వివరించారు. కడప జిల్లాలో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్ .. ఈ వివరాలను వెల్లడించారు.