Pendurthi Abhiram: రాజానగరం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్ కుమారుడు అభిరామ్ తీరు వివాదాస్పదమైంది. వైఎస్సార్సీపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ, టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, పార్టీకి నష్టం కలిగిస్తున్నారని రాజానగరం టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అభిరామ్ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు హామీ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.