TDP Mahanadu Huge Donations: కడపలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో విరాళాల వెల్లువ కురిసింది. తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ.5 కోట్లతో అగ్రస్థానంలో నిలిచారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తమకు తోచినంత విరాళాలు ఇచ్చారు. పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం ఈ విరాళాలు ఉపయోగపడతాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ నియమావళిలో మార్పులు చేయాలని పర్చూరి అశోక్బాబు కోరారు.