Gollapalli Amulya Complaint On Husband Sunil: రాజోలులో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు వరకట్న వేధింపుల కేసు కలకలం రేపుతోంది. భర్త సునీల్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని, హత్యాయత్నం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రీకూతుళ్లు ఒకే నియోజకవర్గానికి వేర్వేరు పార్టీల నుంచి ఇంఛార్జ్లుగా ఉండటం, ఈ కేసు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే అమూల్య భర్త సునీల్ ఫేస్బుక్ పోస్ట్ వైరల్ అవుతోంది.