మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో సమాజం విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ టీచర్ స్కూల్లో చదివే అమ్మాయిని ట్రాప్ చేశాడు. పదో తరగతి చదువుతున్న బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. విషయం బాలిక తల్లికి తెలియటంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్టూడెంట్ను పెళ్లి చేసుకున్న టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.