Unguturu Tenth Class Students Get 10 Grams Gold: కృష్ణా జిల్లా ఉంగుటూరు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పారిశ్రామికవేత్త గుత్తా సుమన్ కుమార్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ వచ్చిన విద్యార్థికి 10 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వనున్నారు. అంతేకాకుండా, ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రతి తరగతిలోనూ ఫస్ట్ వచ్చిన వారికి ఆయా తరగతుల సంఖ్యకు సమానమైన గ్రాముల బంగారం అందిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడమే దీని వెనుక ముఖ్య ఉద్దేశ్యమని ఆయన పేర్కొన్నారు.