టోల్ ప్లాజా వద్ద ఆపకుండా వెళ్లిన కారు.. అనుమానంతో డ్రోన్ ఎగరేసిన పోలీసులు.. తీరా చూస్తే!

1 year ago 13
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గంజాయి సరఫరాను పోలీసులు అడ్డుకున్నారు. కారులో అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే కీసర టోల్ ప్లాజా వద్ద పోలీసులను గమనించిన ఓ కారు.. ఆగకుండా వెళ్లిపోయింది. దీంతో డ్రోన్ సాయంతో పోలీసులు కారు కోసం గాలించారు. చివరకు నందిగామ శివార్లలో కారు ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పరిశీలిస్తే కారులో 120 కిలోల గంజాయి లభ్యమైంది. కారును వదిలేసి దుండగులు పారిపోగా.. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
Read Entire Article