తెలంగాణలో ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. చలాన్ల పేరుతో వాహనాలను సీజ్ చేయడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ, హోమ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు అమలు కాలేదా అని అధికారులకు ప్రశ్నలు వేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను వచ్చే నెల 19కు వాయిదా వేసింది.