తెలంగాణలో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే ట్రాకులపై నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు రద్దు కాగా, మరికొన్ని పాక్షికంగా రద్దు లేదా రీషెడ్యూల్ అయ్యాయి. వరంగల్ నగరం 'మొంథా' ప్రభావంతో మునిగిపోగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.