దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లలో హిజ్రాల వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బులు వసూలు చేయడంతో పాటు, భౌతిక దాడులు, అసభ్యకర చేష్టలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇటీవల సికింద్రాబాద్-విజయవాడ రైలులో జరిగిన ఘటనపై ఫిర్యాదు అందగా, పోలీసులు ఐదుగురిని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన కాస్త సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. ట్రైన్ ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.