సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో, అమాయకులను మోసం చేస్తున్న కిలాడీ లేడీ సరిత అలియాస్ ప్రత్యూషను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. తాను ఐఏఎస్ అధికారిని, డాక్టర్, డీఎస్పీ కూతురు అంటూ వివిధ హోదాలను చెప్పుకుంటూ యువకులను మోసం చేసి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొదట హాస్టళ్లలో దొంగతనాలు చేసి, ఆ తర్వాత డబ్బున్న వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు.