విజయవాడలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తమ వద్ద నమ్మకంగా పనిచేస్తోందని ఓ కుటుంబం పనిమనిషికి ఇల్లు అప్పగిస్తే.. ఆ మహిళ ఏకంగా కోటి రూపాయలు విలువైన బంగారం కాజేసింది. విజయవాడలోని సూర్యారావుపేటలో ఈ ఘటన జరిగింది. ఇంటి యజమాని ఫిర్యాదుతోరంగంలోకి దిగిన పోలీసులు.. పనిమనిషిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి చోరీ చేసిన 837 గ్రాముల బంగారం రికవరీ చేశారు. వీటి విలువ సుమారుగా కోటి ఉండొచ్చని అంచనా. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.