తెలంగాణలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్న్షిప్ తప్పనిసరి కానుంది. విద్యార్థుల ఉపాధి సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శిక్షణ కాలంలో విద్యార్థులకు స్టైఫండ్ అందించేందుకు ఆర్థిక నమూనాను సిద్ధం చేస్తున్నారు.