ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో.. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు రోడ్ల అనుసంధాన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. రాష్ట్రంలోని100కుపైగా ప్రధాన క్షేత్రాలకు గ్రామీణ రోడ్ల అనుసంధానం చేపడుతున్నారు. రూ.120 కోట్లతో 205 కిలోమీటర్ల పొడుగున ప్రధాన ఆలయాలకు అనుసంధాన రహదారులు నిర్మిస్తున్నారు. ఐ.ఎస్.జగన్నాథపురం, అహోబిలం వంటి క్షేత్రాలకు గ్రామీణ రహదారులను అనుసంధానిస్తు్న్నారు. వీటిలో 40 శాతం రోడ్లు ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి.