Andhra Pradesh Government Release Revolving Fund to Dwcra Groups: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రాష్ట్రంలోని రెండు వేల డ్వాక్రా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ నిధులు మంజూరు చేసింది. డ్వాక్రా సంఘానికి రూ.15 వేలు చొప్పున రూ.3 కోట్లు నిధులు మంజూరు చేసింది. అయితే కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు మాత్రమే ఈ రివాల్వింగ్ ఫండ్ నిధులు మంజూరు చేస్తున్నారు. డ్వాక్రా మహిళల పొదుపునకు ఈ రివాల్వింగ్ ఫండ్ కూడా కలవడంతో సంఘం నిధి పెరిగి.. బ్యాంకుల నుంచి అధిక రుణం తీసుకునేందుకు వీలవుతుందని అధికారులు చెప్తున్నారు.