డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. మూడు లక్షల రూపాయల వరకూ వడ్డీ లేని రుణం పొందేందుకు అవకాశం ఇస్తోంది. అయితే ఇది శ్రీసత్యసాయి జిల్లాలో మాత్రమే. పీఎం అజయ్ పథకం కింద పొదుపు సంఘాలలోని ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు.. లక్ష రూపాయల నుంచి రూ. 3 లక్షల వరకూ వడ్డీ లేకుండా రుణం అందించనున్నారు. ఇందులో 50 వేలు రాయితీ కూడా అందిస్తారు. జిల్లాకు 130 యూనిట్లు మంజూరు కాగా.. ఆసక్తి, అర్హత కలిగిన మహిళలు మండలంలోని మహిళా సమాఖ్యలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.