రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పొదుపు సంఘాలు ఆన్లైన్లోనే రుణాలు పొందే సదుపాయం తెస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గుంటూరులో జరుగుతున్న సరస్ మేళాను చంద్రబాబు సందర్శించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించిన చంద్రబాబు.. వారితో ముచ్చటించారు. ఈ సందర్భంగానే ఆన్లైన్ ద్వారా రుణాలు పొందేలా సదుపాయం కల్పి్స్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు.