మహిళల ఆర్థిక స్వావలంబనకు అనేక చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం.. ఇప్పుడు మరో ఆలోచన చేస్తోంది. బాలింతలకు సేవలు అందించే తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలకు మహిళా డ్రైవర్లను నియమించే యోచన చేస్తోంది. ఈ విషయాన్ని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అధునాతన సౌకర్యాలతో రూపొందించిన నూతన తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను మంత్రి సత్యకుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లకు మహిళా డ్రైవర్లను నియమించే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.