తల్లి సంరక్షణను పట్టించుకోని కూతురికి షాక్.. 13 ఏళ్ల కిందట రాసిచ్చిన ఆస్తి రద్దు..

4 months ago 5
తల్లి బాగోగులు చూడని ఓ కూతురికి ధర్మవరం ఆర్డీవో షాక్ ఇచ్చారు. ఎప్పుడో 13 ఏళ్ల కిందట రాసిచ్చిన ఆస్తిని రద్దు చేశారు. తిరిగి తల్లికే ఆ ఆస్తి చెందేలా ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మవరం పట్టణానికి చెందిన లక్ష్మమ్మకు లక్ష్మీదేవి అనే కూతురు ఉంది. 2012లో లక్ష్మమ్మ తన కూతురు లక్ష్మీదేవికి 59 సెంట్ల స్థలం రాసిచ్చారు. అయితే ఆ తర్వాత లక్ష్మీదేవి తల్లి బాగోగులు పట్టించుకోవడం మానేసింది. దీంతో ఈ విషయంపై లక్ష్మమ్మ ధర్మవరం ఆర్డీవోకు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన ఆర్డీవో నిజమని తేల్చారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం లక్ష్మీదేవికి రాసిచ్చిన ఆస్తిని రద్దు చేసిన ధర్మవరం ఆర్డీవో.. ఆ 59 సెంట్లు తిరిగి లక్ష్మమ్మకు చెందేలా ఉత్తర్వులు ఇచ్చారు.
Read Entire Article