Annadata Sukhibhava Scheme 2025: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ప్రభుత్వ పథకాలపై సమీక్షించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నామని.. ఏడాది పాలనలో ప్రజలకు ఏం చేశామో వివరించారు. ప్రతి నెలా తానే స్వయంగా వెళ్లి పింఛన్ల పంపిణీలో పాల్గొనడానికి కారణాన్ని వివరించారు. తల్లికి వందనం, అన్నదాత పథకాలపై క్లారిటీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కడపలో జరిగిన మహానాడు విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.