అన్నమయ్య జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ భార్య తన భర్తను దారుణంగా చంపేసింది. మద్యంలో విషం కలిపిన భార్య, ఆపై భర్త గొంతు నులిమి హత్య చేసింది. అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే తల్లికి వందనం డబ్బులతో మద్యం తాగేశాడనే కోపంతోనే భార్య భర్తను హత్య చేసినట్లు తెలిసింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు.