గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ ప్రాంతంలో మహిళల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఈ ఏడాది జనవరి 31న ఓ మహిళ హత్యకు గురికాగా.. తాజాగా మార్చి 23వ తేదీన మరో మహిళ శవమై తేలింది. గుంటూరు కాలువ పక్కన ఉన్న తుమ్మచెట్లలో మహిళ మృతదేహం కనిపించింది. స్థానికులు దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు..చనిపోయింది కృష్ణా జిల్లాకు చెందిన మహిళగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.