తిరుపతి తరహాలో అక్కడ కూడా అద్దాల మండపం.. రూ. కోటి విరాళమిచ్చిన దాత..

5 months ago 15
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల ఆలయానికి భారీ విరాళం అందింది. సోమవారం ఓ భక్తుడు కోటి రూపాయలు విరాళంగా అందించారు. తిరుపతి తరహాలోనే ద్వారకా తిరుమల కొండపై కూడా అద్దాల మండపం నిర్మించాలనే ఉద్దేశంతో అనకాపల్లి జిల్లాకు చెందిన విశ్రాంత ఉద్యోగి కొండలరావు కోటి రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతను ఆలయ ఈవో అభినందించారు. సత్కరించి.. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. మరోవైపు ఆలయంలో అక్టోబర్ 2 నుంచి 9 వరకూ మహోత్సవాలు జరగనున్నాయి.
Read Entire Article