తిరుపతిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధాన్ని వద్దన్నందుకు ఓ వ్యక్తి.. మహిళను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేసే సోమశేఖర్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సమోసా దుకాణంలో పనిచేసే మహిళకు.. ఇతనితో పరిచయమై.. ఆ పరిచయమే వివాహేతర సంబంధానికి దారితీసినట్లు తెలిసింది.