తిరుమల శ్రీవారి భక్తులను బెదిరించి దోపిడీకి పాల్పడిన ఘటన శ్రీనివాసమంగాపురంలో చోటుచేసుకుంది. హైదరాబాద్కు చెందిన ముగ్గురు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి నుంచి శ్రీవారిమెట్టు మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీనివాసమంగాపురం నుంచి శ్రీవారిమెట్టు వెళ్తున్న సమయంలో కొంతమంది దుండగులు వారిని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. అయితే అదే సమయంలో భక్తులు కొంతమంది అటుగా రావటంతో పారిపోయినట్లు బాధితులు చెప్తున్నారు.