వేసవి రద్దీని తగ్గించడానికి దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను పొడిగించింది. చర్లపల్లి-తిరుపతి మధ్య నడిచే 26 ప్రత్యేక రైళ్లు జూన్ చివరి వరకు పొడిగింపు పొందాయి. నంబర్ 07017/07018 (శుక్ర, ఆదివారాలు/సోమ, శనివారాలు) కాచిగూడ, మహబూబ్నగర్, కర్నూలు మీదుగా వెళ్తాయి. నంబర్ 07251/07252 (బుధ, గురువారాలు) కాజీపేట, వరంగల్, విజయవాడ మీదుగా నడుస్తాయి. ప్రయాణికులు మారిన రైళ్ల టైమింగ్స్ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.