తిరుపతిలో అపచారం.. ఏంటిది గోవిందా.? నలుగురు ఉద్యోగులపై వేటు..

2 months ago 12
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో అపచారం జరిగింది. అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద మందు బాటిళ్లు, మాంసాహారం కనిపించడం కలకలం రేపింది. కొంతమంది భక్తులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మద్యం, మాంసాహారం మీద నిషేధం ఉన్న ప్రదేశంలో ఇలాంటివి కనిపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణ జరిపింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంతో ఓ పర్మినెంట్ ఉద్యోగితో పాటుగా ముగ్గురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది.
Read Entire Article