తిరుపతిలో చిరుత సంచారం.. ఆందోళనలో విద్యార్థులు

5 months ago 10
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదిక్ యూనివర్సిటీలో చిరుతల సంచారం కలకలం రేపింది. ఆదివారం రాత్రి సమయంలో ఓ చిరుత యూనివర్సిటీ ప్రాంతంలో సంచరిస్తూ విద్యార్థులకు కనిపించింది. హాస్టల్ వద్ద చిరుత కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యా రు. మరోవైపు ఇటీవలి కాలంలో యూనివర్సిటీలో చిరుత కదలికలు తరుచుగా కనిపిస్తూ ఉండటంతో విద్యార్థులు భయపడిపోతున్నారు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని.. చిరుతను బంధించాలని కోరుతున్నారు. మరోవైపు చిరుత సంచారంతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.
Read Entire Article