తిరుపతిలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం.. రాళ్లతో దాడి, ఒకరు మృతి

8 months ago 9
తిరుపతిలో సోమవారం ఓ మతిస్థిమితం లేని వ్యక్తి బీభత్సం సృష్టించాడు. నంది సర్కిల్, కపిలతీర్థం మార్గంలో రాళ్లు రువ్వి పాదచారులు, యాచకులపై దాడి చేయడంతో ఒకరు మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, స్థానికుల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద కత్తులు కూడా లభ్యమయ్యాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article