Dwaraka Tirumala Temple Land Donation: ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుడు భారీ విరాళాన్ని అందజేశారు. హైదరాబాద్కు చెందిన భక్తుడు కోటేశ్వరరావు ఏకంగా 4.32 ఎకరాల భూమిని ఆలయం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు.. ఈ మేరకు పత్రాలను ఆలయ ఈవోకు కూడా అందజేశారు. ఈ భూమిపై వచ్చే ఆదాయంతో ఉపాలయ క్షేత్రపాలకుడైన శివయ్యకు కళ్యాణం రుద్రాభిషేకం ప్రతి నెలా నిర్వహించాలని దాత కోరారు. అలాగే ఆయన చిన్న వెంకన్నను దర్శించుకున్నారు.