టీటీడీ మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో దివ్య ఔషధ వనం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 4.25 కోట్లతో 3.90 ఎకరాల్లో దివ్య ఔషధ వనం ఏర్పాటుకు టీటీడీ ఆమోదం తెలిపింది. తిరుమల జీఎన్సీ టోల్ గేట్ వద్ద ఎగువ, దిగువ ఘాట్ రోడ్ల మధ్యలో ఈ దివ్య ఔషధ వనం ఏర్పాటు చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ వనం ద్వారా అంతరించిపోతున్న, అరుదైన ఔషధ మొక్కల సంరక్షణ చేపట్టాలని నిర్ణయించారు.