TTD Chairman Tirumala Vaikunta Dwara Darshans: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ఈసారి రికార్డు స్థాయిలో విజయవంతమయ్యాయి. 7.83 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకోగా, 41 కోట్ల రూపాయలకు పైగా కానుకలు వచ్చాయి. 44 లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి. భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, పుష్ప, పండ్ల అలంకరణలు, వైద్య సేవలు అద్భుతంగా ఉన్నాయని టీటీడీ ఛైర్మన్ తెలిపారు. ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణతో ఏర్పాట్లు పక్కాగా జరిగాయి.