శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి తిరుపతికి వచ్చే వాహనాలు నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తిరుమలలో దర్శనం అనంతరం భక్తులు గంట ముందుగానే తిరుపతికి బయల్దేరాలని టీటీడీ సూచించింది. రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు, బస్టాండ్లకు వెళ్లే భక్తులు ముందస్తుగానే ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ఘాట్ రోడ్డులో డ్రైవింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.