తిరుమల పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పరకామణి చోరీ వ్యవహారాన్ని లోక్ అదాలత్లో రాజీ చేసుకోవడంపై దర్యాప్తు చేయాలని సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. డీజీ స్థాయికి తగ్గని ఆఫీసర్ను.. దర్యాప్తు అధికారిగా నియమించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు, అధికారుల పాత్రపై కూడా దర్యాప్తు చేయాలని తెలిపింది. ఇక నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులపై.. దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశించింది.