పరకామణి చోరీ కేసుకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో మంగళవారం టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలపై నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 30 నుంచి పది రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే తిరుమల పరకామణి చోరీ ఘటనపై పోలీసులకు మరోసారి ఫిర్యాదు చేయాలని టీటీడీ పాలకమండలి సమావేశంలో బోర్డు సభ్యులు తీర్మానం చేశారు.