తిరుమల మద్యం బాటిళ్ల వ్యవహారం.. కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు

7 months ago 22
తిరుమలలో ఖాళీ మద్యం సీసాల వ్యవహారంలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. తిరుపతికి చెందిన వైసీపీ కార్యకర్త కోటితో పాటుగా, ఓ మీడియా ఛానెల్ ప్రతినిధిని అరెస్ట్ చేశారు. టీటీడీకి, పోలీసులకు చెడ్డపేరు తీసుకురావాలనే కుట్రలో భాగంగానే వీరు ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు తిరుమలలో మద్యం బాటిళ్ల కేసులో జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. దీని వెనుక వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని.. కోటి భూమన అనుచరుడని కిరణ్ రాయల్ ఆరోపించారు.
Read Entire Article